Home » Special trains
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ముంబయి - దుబాయ్ మధ్య సుమారు 1,900 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఈ మార్గాన్ని రెండు గంటల్లో చేరుకుంటే.. అంటే విమానం కంటే వేగంగా ప్రయాణించగలిగితే.. ఎలాగుంటుంది.. త్వరలోనే ఆ కల సాకారమవనుంది. అదెలాగంటారా.. ఈ కథనం చదవండి మరి...
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.