Home » Sourav Ganguly
కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అతడు చరిత్రపుటలకెక్కాడు.
టీ20 వరల్డ్కప్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు...
Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(sourav ganguly) బుధవారం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి(vishnu dev sai)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి చర్చించిన గంగూలీ సీఎంను క్రికెట్ విషయంలో సపోర్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు పగ్గాలను స్వీకరించడానికి రోహిత్ ఇష్టపడలేదని.. అన్ని ఫార్మాట్లు ఆడుతుండటంతో ఆటగాడిగా తనపై చాలా ఒత్తిడి ఉందని చెప్పాడని గంగూలీ తెలిపాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాకిస్థాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ చాలా బాగా ఆడేదని.. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదని కామెంట్ చేశాడు.