Home » Sourav Ganguly
భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ పేరుతో పలు బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి పుట్టినరోజు వేళ అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్ఠాత్మక 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు కల్పించింది.
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్పై గంగూలీ స్పందించాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు రానున్న ఆసియా గేమ్స్ 2026కు సంబంధించిన భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూసుఫ్ పఠాన్ తన ఎంపీ సీటుకు రాజీనామా చేసేలా ఒప్పించేందుకు మాజీ సీఎం మమత తరఫున తాను సంప్రదింపులు జరిపినట్టు వస్తున్న వార్తలను సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. దాదాకు గతంలో ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరికి కుదిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఆడే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.