Home » Sharad Pawar
'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడుతో మాట్లాడారంటూ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్పవార్ కొట్టివేశారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.
రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్సలో విలీనమవుతాయని లేదా ఆ పార్టీకి మరింత దగ్గరవుతాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందని, ఇంతకుమించి పవార్ ఎన్సీపీకి మరో మార్గం లేదని ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఏక్నాథ్ షిండే శివసేనలో చేరిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారంనాడు జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను పోటీకి దింపింది.
బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.
కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు..! మరికొందరేమో తెరవెనుక కీలక వ్యూహకర్తలు..!
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ‘ఎన్సీపీ-ఎస్సీపీ’ పేరుతో పాటు ‘మనిషి ఊదుతున్న తుర్రా’ (Man Blowing Turrah) చిహ్నాన్ని ఉపయోగించుకోవచ్చని.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (National Congress Party) చెందిన శరద్ పవార్ (Sharad Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆ చిహ్నాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్నికల చిహ్నంగా రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) ఆదేశించింది.
మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు.