Home » Shamshabad
కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా హైడ్రా అధికారులు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలు కూల్చివేశారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. అయితే విమానం నిలిచిపోయిన విషయాన్ని ప్రయాణికులకు చెప్పడంతో ఎయిర్పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఇద్దరు గవర్నర్లు, మరో లెఫ్టినెంట్ గవర్నర్ అనూహ్యంగా కలుసుకున్నారు. ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది.
నకిలీ వాహన బీమా పత్రాలు, డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందులో ముగ్గురిని అరెస్టు చేయగా, 15 మంది పరారీలో ఉన్నారు.
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ -ట్రస్డెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ-టీటీపీ) అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వర్చువల్గా ప్రారంభించారు.
తెలంగాణ: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం విదేశీ ప్రయాణికుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపఽథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికురాలు హల్చల్ చేసింది.
లింగంపల్లి నుంచి రాజీవ్గాంధీ ఎయిర్పోర్టు(Lingampalli to Rajiv Gandhi Airport)కు ఆదివారం నుంచి పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ సి.వినోద్కుమార్ తెలిపారు.