Home » Sachin Tendulkar
సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు..
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. సమకాలీన క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన గొప్ప క్రికెటర్లు. తమ అద్భుత ఆటతీరుతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వీరిద్దరూ ఎన్నో రికార్డులను తమ పేర లిఖించుకున్నారు. వారు నెలకొల్పిన చాలా రికార్డులను ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు.
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మే నెల మొదటి వారం నుంచే బీసీసీఐ(BCCI) దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. బీసీసీఐ వెబ్సైట్లో గూగుల్ ఫారమ్ను షేర్ చేసిన తరువాత ఇప్పటివరకు 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటం స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF)లో కలకలం రేపింది.
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
హలీమ్.. అందులోనూ హైదరాబాద్ హలీమ్. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. లొట్టలేసుకుని తినడమైతే పక్కా. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు క్షణాల్లో ఆరగించేస్తారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా హైదరాబాద్ హలీమ్ ప్రేమలో పడిపోయాడు.
టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న అంటే 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచింది. తద్వారా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు.
టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చారిత్రాత్మక వాంఖడే స్టేడియం(Wankhede Stadium) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్(Sachin Tendulkar) చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్బాల్ వ్యూహం అంటూ భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.