Home » Russia
అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది..
గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి చర్చలు జరిపినప్పటికీ.. యుద్ధం ఆపలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక భేటీపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
తాగిన మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటూ ఉన్నారని దారుణానికి పాల్పడింది. గన్నుతో కాల్పులకు తెగబడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రష్యాకు చెందిన ఓ పాత్రికేయుడు.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ముందే తన గర్ల్ ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది సైకోల్లా మారుతూ తమ భాగస్వామిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రష్యాలో ఓ వ్యక్తి చేసిన దారుణం గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది..వీడు మనిషా లేక నరమాంస భక్షకుడా అన్న అనుమానం వస్తుంది.
శుక్రవారం పుతిన్ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్ భవన్లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.