Home » Russia
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నారా? ఉక్రెయిన్ తనపై హత్యాయత్నానికి పాల్పడుతుందని భావిస్తున్నారా? ఆ భయంతోనే బంకర్లలో దాక్కున్నారా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ దాడికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం.
రష్యా నుంచి భారత్కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు.
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సోమవారం సెయింట్ పీటర్స్ బర్గ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం అయ్యారు. ఇరాన్ ప్రయోజనాలకే తమ ప్రాధాన్యమని పుతిన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కాబోతున్నారు. సోమవారం మాస్కోలో ఈ సమావేశం జరగనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇస్లామాబాద్లో సుమారు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు.
రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టును శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది.
భారత్కు ముడి చమురు, సహజవాయువు సరఫరాను పెంచే సామర్థ్యం తమ కంపెనీలకు ఉందని రష్యా ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ డెనిస్ మంటురావ్ తాజాగా తెలిపారు.
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.