Home » RK Roja
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.
కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా.
ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే..
RK Roja: ఏపీకి చెందిన మంత్రి రోజాను ఆమె శాఖకు సంబంధించిన అభివృద్ధిపై విజయవాడలో మీడియా ప్రశ్నించగా.. ఆమె ఎప్పటిలాగా టీడీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో క్రీడా స్థలాలు, స్టేడియాల అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు.
ఆరోగ్యం, ఆనందానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ( Minister RK Roja ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ‘‘ఆడుదాం ఆంధ్రా’’పై మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం చేపట్టారని ఆర్కే రోజా తెలిపారు.
తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో (CBN Skill Case) అక్రమ అరెస్ట్తో తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు..
19 ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించిన విన్నర్లు ఈరోజు(శుక్రవారం) సీఎం జగన్ను కలిశారని మంత్రి రోజా తెలిపారు.