Share News

AP Politics: అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు.. అయినా చంద్రబాబు జపమే..!!

ABN , First Publish Date - 2023-12-01T19:21:46+05:30 IST

RK Roja: ఏపీకి చెందిన మంత్రి రోజాను ఆమె శాఖకు సంబంధించిన అభివృద్ధిపై విజయవాడలో మీడియా ప్రశ్నించగా.. ఆమె ఎప్పటిలాగా టీడీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో క్రీడా స్థలాలు, స్టేడియాల అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు.

AP Politics: అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు.. అయినా చంద్రబాబు జపమే..!!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. ఈ విషయంపై వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తుంటే ప్రతిగా వాళ్లు ఎదురుదాడి చేస్తున్నారు. అంతా టీడీపీనే కారణమంటూ కామెంట్ చేస్తూ తెలివిగా తప్పించుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా కొంతమంది మంత్రులు ఇంకా చంద్రబాబు జపం చేస్తున్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ఆ విషయం చెప్పలేక రివర్స్ పాలన తరహాలో రివర్స్ క్వశ్చన్‌లు అడుగుతున్నారు.

తాజాగా మంత్రి రోజాను ఆమె శాఖకు సంబంధించిన అభివృద్ధిపై విజయవాడలో మీడియా ప్రశ్నించగా.. ఆమె ఎప్పటిలాగా టీడీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో క్రీడా స్థలాలు, స్టేడియాల అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. సమాధానం‌ చెప్పలేక... ఆనాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని ఎదురు దాడి చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీలోని క్రీడా స్థలాలు ఇంకా దారుణంగా ఉన్నాయని మంత్రి రోజా ఆరోపించారు. తమ హయాంలో క్రీడాకారులకు మంచి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T19:21:47+05:30 IST