Home » RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు.
Chinnaswamy Stadium Stampede Case: స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో చోటు చేసుకున్న విషాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై క్రీడలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ స్పందిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్ 11 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 50 మందికి పైగా సామాన్యులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొల్పింది.
18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్బీఐ.
బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది.