Home » Raptadu
హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్ స్కూల్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేస్తోంది. ఈక్రమంలోనే పురుగు మందులు పిచికారీ చేయడానికి సబ్సిడీపై డ్రోన్లు అందజేసింది.
మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ఆశయాలను పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ ముందుకు తీసుకువెళుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవీంద్ర అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు.
లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు.
విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్ విభాగాధిపతి వేణుగోపాల్రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.