Home » Raptadu
నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్కు సూచించారు.
వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎ మ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు.
అధికారంలో ఉండగా రైతుల గురించి ఏ మార తం పట్టించుకోకుండా, విద్యుతరంగాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ అఽధినేత వైఎస్ జగన ఇప్పుడు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎమ్మె ల్యే పరిటాలసునీత విమర్శించారు. మండలం లోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేక రుల సమావేశంలో మాట్లాడారు.
అకాల వర్షాలు అన్నదాతకు నష్టం తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో ఎడతెరపిలేకుండా కురుస్తు న్న వ ర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలతో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటి ల్లింది.
విద్యార్థులు సెల్ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నా రు. కేక్కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు.
ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
గత వైసీపీ హయాంలో ఏ కార్యాలయంలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి, ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. మండలంలోని గంగినేపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొం టున్న భూసమస్యలపై పలువురు రైతులు ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు.
కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి, సస్యశ్యామ లం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపన అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
మీకున్న పదవులతో బాధ్యతా యు తంగా పనిచేసి చెరువులకింద రైతులు నష్టపోకుండా చూడాలని సాగునీటి సం ఘం నూతన సభ్యులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం జరిగి న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాద్యక్షులు, సభ్యులు ఆదివారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని కలిశారు. ఎటువంటి గొడవలులేకుండా ఏకగ్రీవంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేసి, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.