Home » Rajya Sabha
సాయుధ బలగాలకు రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేయడం ఎంతో ముఖ్యమని జేేపీ నడ్డా పేర్కొన్నారు. 2005 ఢిల్లీ వరుస బాంబు పేలుళ్లు, 2006 వారణాసి ఉగ్రదాడి, 2006 ముంబై లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.
ఆపరేషన్ సిందూర్పై రాజ్యసభలో చర్చించేందుకు కాంగ్రెస్కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.
నేడు పార్లమెంటు సమావేశాలు ఉదయం మొదలైన కొద్ది సేపటికే హంగామా వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నేతలు లోక్సభ, రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలను వాయిదా వేశారు.
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా..
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదు మంది.. డీఎంకే నుండి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగంతో పాటు..
ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.
విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.