Home » Rajya Sabha
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభ రేసులో ఉన్న గోవింద్ ధోలకియా, డాక్టర్ జస్వంత్సిన్హ్ సలామ్సిన్హ్ పార్మార్, మయాంక్ నాయక్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.
తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది.
రానున్న లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రానప్పటికీ.. ప్రధాన పార్టీలు తమ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా..
ముగ్గురు వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు విజయరాజు వెల్లడించారు.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది.