Home » Rajnath Singh
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.
''ఒకే దేశం-ఒకే ఎన్నిక'' పేరుతో లోక్సభ నుంచి స్థానిక సంస్థల వరకూ ఎన్నికలన్నీ ఒకేసారి జరిపేందుకు కేంద్రం కొద్దికాలంగా కసరత్తు చేస్తోంది. ఆదివారంనాడు లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ వనరులు, సమయం ఆదా కావాలంటే 'ఒకే దేశం ఒకే ఎన్నిక' తప్పనిసరి అని అన్నారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.
టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారా..? డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్ర మంత్రితోనే పైరవీలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం.
లోక్సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వెంటనే ప్రచారబరిలోకి దిగేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. 7 విడతల్లో జరిగే పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీల వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
కొన్నేళ్లుగా చైనా సరిహద్దులో (China Border) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా భారత్ (India) జోలికి వస్తే.. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా.. వేగంగా, సమర్ధవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.