Home » Rajahmundry
Andhrapradesh: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ను నేరాంధ్రప్రదేశ్గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు.
రాజమండ్రి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.
రాజమండ్రిలో (Rajahmundry) దారి దోపిడీకి (Robbery) పాల్పడిన నిందితుల్ని పట్టుకోవడం కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ (Special Operation) విజయవంతం అయ్యింది. ఈ ఆపరేషన్లో భాగంగా.. మొత్తం 9 మంది నిందితుల్ని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల మూడు లక్షల విలువైన 3.5 కేజీల బంగారు నగల్ని రికవరీ చేశారు.
Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్ తగ్గినట్టు అయింది..
రాజమండ్రి: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్పై వైసీపీ మూకలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని, హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, గవర్నర్ కూడా స్పందించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని, ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.
‘రాజధాని పైల్స్’ సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?.. ప్రకటనలు పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మృతి చెందిన ఓట్లను తొలగించలేదని, టీడీపీ హయాంలో రాజమండ్రిలో 6,200 టిడ్కో గృహాలు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలు ఎందుకు లబ్ధిదారులకు అందజేయలేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
రాజమండ్రి: ఈనెల 11న దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వాలెంటీర్ల ద్వారా మీటింగ్కు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..
Chandrababu Narrow Escape : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో స్టేజీ మీద నుంచి చంద్రబాబు కిందపడబోయారు...
తూర్పు గోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని..
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, గుంటూరు జిల్లా, పొన్నూరులలో ‘ రా కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.