Home » Raja Singh
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ బీజీపీలోకి వెళ్లటంపై మరో సారి స్పష్టత ఇచ్చారు. మళ్లీ వెనక్కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ‘బోనాలపై తాగి ఆడే బోనాలు’ అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారం తప్పు అని.. బోనాలపై కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది.
Raja Singh Resignation Reaction: దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించేందుకు 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు రాజాసింగ్ తెలిపారు. బీజేపీ తనకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు.
Raja Singh Resignation Accepted: రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.
పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.
బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్రావు రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.