Home » Rains
అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది.
చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై బాలిక మృతిచెందింది.
ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.