Home » Prakasam
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
పొదిలి ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసింది. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడంతో ఆ ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వైసీపీ మోసం బయటపడింది.
ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.
‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్కు ఆయన లేఖ రాశారు.