Home » Ponnam Prabhakar
బీసీల నోటి కాడి బువ్వను బీజేపీ నేతలు తన్నే కుట్రలు చేస్తున్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి బీసీ వ్యతిరేకి అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫ్యూడలిస్టు అని మండిపడ్డారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.
భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సంబంధింత అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణను కూడా మానవసేవగా పరిగణిస్తారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం కోటా పరిమితిని ఎత్తేసినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎందుకు ఎత్తేయరు
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.
రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీలను అమలు చేస్తూ రవాణాశాఖను ముందంజలో ఉంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్కి వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్రం వాహన సారథిలోకి ఎంట్రీ అయిందని చెప్పారు. వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ అన్నీ వాహన సారథిలో చూసుకోవచ్చని మంత్రి ప్రభాకర్ తెలిపారు.