Home » Ponnam Prabhakar
Telangana: కవిత గతంలో బతుకమ్మ, తర్వాత జాగృతి ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేశారు. కొందరికి అధికారం మత్తు దిగి మస్తు గుర్తుకొస్తాయంటూ సెటైర్ విసిరారు. బీఆర్ఎస్ తమ పార్టీ పదవుల్లో బీసీలకు అవకాశమివ్వాలన్నారు. పార్టీ ఓనర్లలో తాను ఒకడిని అని ఈటెల రాజేందర్ అన్నందుకు మెడలు పట్టి బయటకి పంపారని విమర్శించారు.
Minister Ponnam Prabhakar: ప్రతి పాఠశాలలో యునిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 500 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్పై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రబాకర్ చెప్పారు.
Telangana Government : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు తెలంగాణ సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ప్రజాపాలనలో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.9,200.32 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సూచించారు. సమ్మెను విరమించుకుంటే... వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.
నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.
పార్లమెంట్లో అంబేద్కర్ను విమర్శించినట్లు ఎన్టీఆర్ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఊరుకుంటారా అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
పార్లమెంట్లో అంబేడ్కర్ను విమర్శించినట్లు ఎన్టీఆర్ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఊర్కుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలకు ఆస్కారం లేకుండా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏ తప్పూ చేయకపోతే.. విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైందనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారని మండిపడ్డారు.