Home » Politics
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తి గత హాజరుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (CBI)కి న్యాయస్థానం ఆదేశించింది. CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం
తిరుమల ప్రసాదంలో కల్తీ ఘటనపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని చెప్పారు. తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలన్నారు. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. త్వరితగతిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్పై ఇన్చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించి వాటి సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు.
ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని కవిత వ్యాఖ్యానించారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.
భక్త కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని అన్నారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
కర్నూలు నుంచి విశాఖపట్నంకు మూడు ఇందిరా బస్ సర్వీస్లను శనివారం మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. గతంలో వైజాగ్ కు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉండేదిని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టూరిజం డెవలప్మెంట్కు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో ఆయన మెమో దాఖలు చేశారు. ఈ నెల 14లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండటంతో ఆయన మెమో దాఖలు చేశారు.
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈనెల 12న మంత్రిమండలి మీటింగ్కి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.