Home » Politics
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.
బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణలో కాంగ్రెస్ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.
తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే.. టీవీకేతో జట్టుకట్టనుందనే చర్చ జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా ఆయన తనయుడు దురై వైకో ఇటీవల సీఎం విజయ్తో వరుస సమావేశాలు నిర్వహించడమే ఈ సంకేతాలకు కారణంగా నిలుస్తోంది.
ప్రముఖ సినీ నటి, అన్నాడీఎంకే (AIADMK) డిప్యూటీ ప్రచార కార్యదర్శి గౌతమి తాడిమళ్ల.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ తన పదవికి రాజీనామా చేశారు.
జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. వివరాల్లోకెళితే...
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీకు మంత్రి పదవి వరించింది.
తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.