Home » Police case
అనంతపురం: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ తల్లికి కేవలం కూతుళ్లు మాత్రమే దగ్గరుండి సర్జరీ చేయించినట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది.చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు.
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ బుధవారం పోలీసుల విచారణకు రానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గోరంట్లపై మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజధాని హైదరాబాద్లోని చాదర్ఘాట్ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్కుమార్, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో వినయ్తోపాటు అతని అక్కను అరెస్టు చేశారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా, ఆదోనిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్కు విధించారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో నోరు విప్పడంలేదు. మూడో రోజు విచారణ నిమిత్తం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు.
వల్లభేనేని వంశీకి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. వంశీపై నమోదైన కేసులన్ని సీట్కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిన్న పోలీసుల విచారణలో వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. వంశీ జవాబులు ఇచ్చినట్టు సమాచారం.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరె హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు.
శ్రీవారి భక్తులకు అభిషేక దర్శనాలు కల్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసిన దళారి రమణ ప్రసాద్పై నాలుగు రాష్ర్టాలలో కేసులు వున్నట్లు సమాచారం. తిరుమలలోనే పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. తనికోసం రెండు నెలలుగా గాలిస్తున్న వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.