Home » Payyavula Keshav
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్కు అరుదైన...
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జిల్లాలో తొలిరోజే 98 శాతం పూర్తి అయింది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. కలెక్టరేట్ ఎనఐసీ నుంచి డీఆర్డీఏ-వెలుగు పీడీ ఓబులమ్మ, ఏపీడీ ఈశ్వరయ్య నేతృత్వంలో 41 మంది ఉద్యోగులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 663 సచివాలయాల పరిధిలో 5,685 మంది సిబ్బంది, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కలెక్టర్ డాక్టర్ ...
నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రజా దర్బారు నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలను తెలిపేందుకు వచ్చిన నాయకులు, ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. అక్కడికక్కడే పరిష్కరించలేని సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. సుమారు రెండు..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
రేపటి(బుధవారం) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు పయ్యావుల, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు.
విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం కావాలని కోరానని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, సచివాలయంలో పేషి ఖరారు కావాల్సి ఉంది. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా కన్ఫామ్ అవనుంది. సచివాలయంలో గల కార్యాలయాలను పవన్ కల్యాణ్ ఈ రోజు పరిశీలించారు. ఇంతలోనే పవన్ పేషీపై వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం సెకండ్ బ్లాక్లో ఫైనాన్స్ అని స్టిక్కర్ కనిపించడం.