Home » Pawan Kalyan
Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.
పాకిస్థాన్పై ధర్మయుద్ధం చేస్తున్న భారత సైన్యానికి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు జనసేన శాసనసభ్యులకు, జనసైనికులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు
పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మొక్కు తీర్చిన 96 ఏళ్ల పోతుల పేరంటాలకు పవన్ స్వయంగా పాదాభివందనం చేసి, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమెకు చీర, రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసి, అమ్మవారి గుడి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సాయం తన పదవి కొనసాగేంత వరకు కొనసాగుతుందనీ, ఇకపై పిల్లల ఇంటికే ఈ మొత్తాన్ని పంపించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు
జమ్ముకశ్మీర్లో పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు
చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతపై విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు
పాకిస్థాన్కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. భారత్ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు.
పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు తన మొక్కు తీర్చుకుంది. పింఛను డబ్బుతో అమ్మవారికి గరగ చేయించి సమర్పించింది
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. యువత ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల కేంద్రంగా మారనుందన్నారు
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పవన్ ప్రసంగం చేస్తున్నప్పుడు గొంతులో ఇబ్బంది వచ్చినప్పుడు మోదీ ఆయనకు విక్స్ ఇచ్చి గొంతు జాగ్రత్త వహించమని సూచించారు.