Home » Parliament
విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.
కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.
గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలపై ..
అహ్మదాబాద్లో గత నెలలో బోయింగ్ డ్రీమ్లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.
ఇటీవల అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.