• Home » Parliament

Parliament

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

Bandi Sanjay: మహిళలు, చిన్నారుల భద్రతకు రూ.13,412కోట్లు ఖర్చు..

దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా రనౌత్ తొలి స్పీచ్.. నెట్టింట వీడియో వైరల్!

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా రనౌత్ తొలి స్పీచ్.. నెట్టింట వీడియో వైరల్!

మండీ నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంటులో గురువారం తొలిసారిగా ప్రసంగించారు. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలపై ఆవేదనా భరితప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె నెట్టింట పంచుకున్నారు.

Parliament: ఎంపీ బాలసౌరి  ప్రశ్నకు  కేంద్ర  మంత్రి ఏం సమాధానం ఇచ్చారంటే..

Parliament: ఎంపీ బాలసౌరి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఏం సమాధానం ఇచ్చారంటే..

న్యూఢిల్లీ: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంట్‌లో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్‌లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు.

Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

గాంధీ, బచ్చన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.

Rahul Gandhi: రైతు  ప్రతినిధులతో రాహుల్ .. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు తెచ్చే యోచన

Rahul Gandhi: రైతు ప్రతినిధులతో రాహుల్ .. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు తెచ్చే యోచన

పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్‌ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.

Rajyasabha:  జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

Rajyasabha: జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్‌కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.

MP Kesineni: పోలవరానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్

MP Kesineni: పోలవరానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్

Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్‌స‌భ‌లో రూల్ 377 కింద పొల‌వ‌రం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం త‌గిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ప్రభుత్వం...

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.

PM Modi:  రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ

PM Modi: రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ

కేంద్రంలో మూడో‌సారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి