Home » Ongole
ఒంగోలులో ఈ రోజు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు వస్తున్నారు. జగన్ బహిరంగ సభకి జనసమీకరణ కోసం ప్రైవేటు స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, మిగిలిన విద్యార్థులకు ఈరోజు నుంచి ఎఫ్ఏ-4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. బస్సులు లేక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి ఆయన నేడు హాజరయ్యారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.
Andhrapradesh: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు.
Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...
Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..
రాబోయే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని.. ఇవే చివరి ఎన్నికలు అని తెలిపారు.
Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏ క్షణాన అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నియోజకవర్గాల ఇంచార్జులను మార్చడం మొదలుపెట్టారో అప్పట్నుంచే.. అధికార పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటి వరకూ రెండు జాబితాలను రిలీజ్ చేయడంతో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. తాడేపల్లి ప్యాలెస్కు క్యూ కడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం..