Home » NRI
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన మారథాన్లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో మహానాడు, నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రవాస తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు.
తెలుగు యువత ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వెలుగొందుతోంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్వేర్ను రూపొందించిన ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నారు.
భారతీయులు, ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.