Home » NRI Latest News
లండన్ వీధుల్లో పాన్ తిని ఉమ్మేసిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై అక్కడి కోర్టులు భారీ జరిమానా విధించాయి. ఒక్కొక్కరికీ 1,391 పౌండ్ల జరిమానా విధించాయి.
అమెరికాలో పలువురు అమాయకులను మోసగించి డబ్బులు దండుకున్న ఒక భారతీయ వ్యక్తి కోసం ఎఫ్బీఐ ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. అతడి వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని ప్రజలను బుధవారం కోరింది.
అక్రమ వలసదారులకు అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధమైతే వారికి 2600 డాలర్లు ఎగ్జిట్ బోనస్ అందించనున్నట్టు ప్రకటించింది.
దుబాయ్ నగరంలో తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు ప్రవాసీయులలో ఆప్యాయత పెంపుదలకు దోహదం చేస్తాయని సంస్థ అధ్యక్షుడు యస్.వి.రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం కువైత్లోని సాల్మీయా ప్రాంతంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్, యువనాయకులు ఓలేటి రెడ్డయ్య చౌదరి అధ్యక్షతన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.
కెనడాలో చదువుకుంటున్న భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడి కాలేజీకి చెందిన 10-12 మంది దాడి చేసి పొట్టన పెట్టుకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీకే ఫంక్షన్ హాల్లో తానా ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు కోసం’ కార్యక్రమంలో వెయ్యి మంది అన్నదాతలకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేశారు.
గల్ఫ్ దేశాలలో జనసైనికులు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆర్భాట కార్యక్రమాలకు బదులుగా సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
అల్ఫారెట్టాలో ‘నాట్యాంజలి – 2026’ పేరుతో నిర్వహించిన వార్షిక కూచిపూడి నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు సేవా సంస్థల కోసం నిధులను సమీకరించారు.