Home » NRI Latest News
న్యూజెర్సీలోని ఎన్నారైలతో నేడు తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో డాలస్లో కూడా ఆమె పర్యటిస్తారని జీహెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు తెలిపారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. డాలర్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. తనకీ బాధ్యత అప్పగించిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఖతర్లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బహ్రెయిన్లో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వైభవంగా సాగాయి. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణుడి నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు భారీ స్థాయిలో ఆహారాన్ని విరాళంగా సేకరించి అవసరమైన వారికి అందజేశారు. 7 వేల పౌండ్ల ఆహారాన్ని అందించి రికార్డు సృష్టించారు.
అమెరికా ప్రభుత్వం మరో షాకిచ్చింది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు మార్చ్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏపీలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకైన ఘటన గల్ఫ్లోని ప్రవాసీయుల్లో కలకలానికి దారి తీసింది. పైప్లైన్ లీకైన మలికిపురం మండలానికి చెందిన అనేక మంది గల్ఫ్లో పని చేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే తమ వారు ఎలా ఉన్నారో అని కంగారు పడుతూ స్థానికులకు ఫోన్ చేశారు.
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం స్థానిక సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగువారు హాజరై కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
జర్మనీలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు. తానుఉంటున్న భనవం కింది అంతస్తులో చెలరేగిన మంటల నుంచి తప్పించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలై కన్నుమూశారు. మృతుడిని జనగామ జిల్లాకు చెందిన హృతిక్ రెడ్డిగా గుర్తించారు.
ఖతర్లోని తెలుగు క్రైస్తవ సహవాసము (టి.సి.ఎఫ్) శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఎడారిలోనూ గలగల ప్రవహించే గోదావరి తీరంలోని చర్చిల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.