Home » Nizamababad
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.
అర్ధరాత్రి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. కారు నడుపుతున్న ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు.
తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కాంగ్రెస్లో(Congress) చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.
వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.