Home » Nizamababad
హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
పౌరసరఫరాల శాఖలో ఇద్దరు జిల్లా అధికారులపై కమిషనర్ డీఎస్ చౌహాన్ కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎ్సవో) చంద్రప్రకాశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు (డీఎం) జగదీశ్పై సస్పెన్షన్ వేటువేస్తూ కమిషనర్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
Telangana: జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1808 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 పైచిలుకు మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి.
Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.
చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది అని సీఎం రేవంత్ అన్నారు. నిజామాబాద్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
Telangana: నిజామాబాద్లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.