• Home » Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: జీవితాంతం ఎన్‌డీఏలోనే ఉంటానన్న నితీశ్.. ఇండియా కూటమిపై విమర్శలు

Nitish Kumar: జీవితాంతం ఎన్‌డీఏలోనే ఉంటానన్న నితీశ్.. ఇండియా కూటమిపై విమర్శలు

జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

INDIA bloc: ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు: నితీష్ కుమార్

INDIA bloc: ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు: నితీష్ కుమార్

'ఇండియా' బ్లాక్‌ నుంచి అనూహ్యంగా తప్పుకుని బీజేపీతో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు అసలు విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టడమే ఇష్టం లేదట. ఇదే విషయాన్ని ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విపక్ష కూటమికి 'ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్' పేరు వద్దని తాను కాంగ్రెస్‌కు, ఇతర విపక్ష కూటమి నేతలకు చెప్పానని తెలిపారు.

Rahul Gandhi: కూటమి నుంచి నితీశ్ వైదొలగడానికి కారణం ఇదే.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

Rahul Gandhi: కూటమి నుంచి నితీశ్ వైదొలగడానికి కారణం ఇదే.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కూటిమికి షాకిస్తూ వైదొలగిన విషయం తెలిసిందే. ఎన్డీయే సారథ్యంలో బిహార్‌లో ఆయన సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇండియా కూటమి నేతలు నితీశ్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Mallikarjuna Kharge: ఇలాంటి పిరికివాళ్లుంటే.. ప్రజాస్వామ్యం ఎలా మనుగుడ సాగిస్తుంది?

Mallikarjuna Kharge: ఇలాంటి పిరికివాళ్లుంటే.. ప్రజాస్వామ్యం ఎలా మనుగుడ సాగిస్తుంది?

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు అందిస్తున్న నేపథ్యంలోనే ఆయన భయంతో కూటమి నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు.

Arvind Kejriwal: ఎన్‌డీఏతో నితీష్ పొత్తుపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..ఢీల్లీ ప్రజలకు కరెంట్ ఫ్రీ!

Arvind Kejriwal: ఎన్‌డీఏతో నితీష్ పొత్తుపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..ఢీల్లీ ప్రజలకు కరెంట్ ఫ్రీ!

ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ ప్రజలకు విద్యుత్ పాలసీలో భాగంగా ఫ్రీగా విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు.

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar Political Crisis: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన తేజస్వీ యాదవ్.. పెద్ద ప్లానే ఉందిగా..!

Bihar Political Crisis: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన తేజస్వీ యాదవ్.. పెద్ద ప్లానే ఉందిగా..!

Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.

Nitish Kumar: ‘ఇండియా’ కూటమి నుంచి నితీష్ వైదొలగడానికి కారణమిదేనట..!

Nitish Kumar: ‘ఇండియా’ కూటమి నుంచి నితీష్ వైదొలగడానికి కారణమిదేనట..!

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఇండియా కూటమి(INDIA Alliance) నుంచి వైదొలుగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్ర్కమించడానికి బలమైన కారణం ఉందని జనతాదళ్(యునైటెడ్)(JDU) చెబుతోంది.

 Bihar Politics: నితీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రియాక్ట్.. చెత్త చెత్తబుట్టలోకి వెళ్లిందంటూ..

Bihar Politics: నితీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రియాక్ట్.. చెత్త చెత్తబుట్టలోకి వెళ్లిందంటూ..

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి