Home » New Delhi
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.
ఢిల్లీలో ఒక యువ జడ్జి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సీలింగ్ ఫ్యాన్ నుంచి వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని గుర్తించిన బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.
దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. అయితే ఇది, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి నిర్వహించిన టెస్ట్ డ్రైవ్.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 - 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు న్యాయమూర్తిపై నమ్మకం పోయిందని.. అందుకే మద్యం కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట నేడు హాజరుకాబోనని చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్కు చెందిన విమానం ఇంజిన్లో టేకాఫ్ సమయంలో లోపం తలెత్తి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ED దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మే 25వ తేదీకి వాయిదా వేసింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకం కానుంది.