Home » New Delhi
పైలట్ అప్రమత్తతో దాదాపు 150 మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. న్యూఢిల్లీ నుంచి లేహ్ బయలుదేరిన విమానం ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ గుర్తించారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ పోలీసులు తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. తమిళనాడులో ఆరుగురిని, పశ్చిమబెంగాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులని తెలిపారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సిద్ధమైనట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ మండపంలోని 15 వీడియో క్లిప్ల ఆధారంగా నిరసనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఇంటరాగేషన్లో కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అయితే పలువురి ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
భారత్జోడో యాత్రలో రాహుల్తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ఫోటోను తాజాగా షేర్ చేశారు.
ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారంనాడు పునరుద్ధరించింది.
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో శుక్రవారంనాడు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య పెరుగుతున్న మైత్రీబంధాన్ని గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీతో తాను కలిసి ఉన్న ఏఐ-ఫోటోను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారంనాడు షేర్ చేశారు.
ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని ఓ విదేశీయుడు తన గొంతును కోసుకున్నాడు. న్యూఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.