Home » New Delhi
విమానయాన రంగంతోపాటు అంతర్జాతీయ సహకారం, వాతావరణ కట్టుబాట్లు, సమానమైన వృద్ధి ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే వేదికగా ఈ సదస్సు ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరంద్ర మోదీ ఆకాంక్షించారు
పాక్ నిఘా ఏజెంట్లకు భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తాజా అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా భారత రక్షణ రంగ మౌలిక వసతుల సమాచారాన్ని సేకరించేందుకు పాక్ ఏజెంట్లు ఈ సిమ్లు వాడుతున్నట్టు గుర్తించారు.
పార్లమెంటుకు సమీపంలోని హై-సెక్యూరీటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
మోదీ అధ్యక్షతన ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల కీలక సమావేశం ఆదివారంనాడు న్యూఢిల్లీలో జరుగనుంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశం అశోకా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుంది.
మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీల మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది.