Home » New Delhi
మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా భాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం జరిగింది.
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు.
దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా పాక్ చర్యలు ఉన్నాయని పలువురు దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఆతిథ్య దేశాలు తమ దేశాల్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, సిబ్బంది, వారి కుటుంబాల భద్రతకు కట్టుబడి ఉండాలని వియన్నా ఒప్పందం నిర్దేశిస్తోంది.
బిహార్లో ఎన్నికల జాబితాలో మోసాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసేందుకు విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సమయంలో జయాబచ్చన్ అక్కడకు చేరుకున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. బిహార్లో వరదలు పోటెత్తి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్డీ హెచ్చరించింది.
ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పనిసామర్థ్యం, సమన్వయం పెరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా మొదటి కర్తవ్య భవన్-3ని ప్రధాని ప్రారంభించారు.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
తెలంగాణ కులగణన దేశానికే రోల్మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇది తన శపథమని అన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలని, తమ శక్తిని తాము తెలుసుకోకపోవడమే కొందరి సమస్యని అన్నారు.
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు.
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.