Home » Nara Lokesh
విశాఖ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. నగరానికి విచ్చేసిన మంత్రికి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను మంత్రి నారా లోకేశ్ సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రేరణ పొందిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. శనివారం హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి తెప్పించిన రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ను మంత్రి లోకేశ్ సమక్షంలో చిన్నారికి వేసి,, చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి వాలిపర్తి దుర్గాప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్తో సమావేశమయ్యారు.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్ఎమ్సీలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు..
మంత్రి నారా లోకేశ్ జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్రీడల్లో రానించటానికి కారణమైన తమ స్వీయ అనుభవాలను క్రీడాకారులు మంత్రి లోకేశ్తో పంచుకున్నారు.
తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనను ఎంపిక చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
గత కొంత కాలంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లను పార్టీలోని కీలక స్థానాలకు తీసుకెళ్తానని లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిజం చేస్తూ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్ఛార్జ్కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించేలా యువ నేత కృషి చేశారు.