Home » Nandyal
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన 'వెల్త్ అండ్ హెల్త్ సొల్యూషన్ స్కీమ్' సంస్థ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. టోల్గేట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఓ కారులో రూ.30 లక్షల నగదు లభ్యమైంది.
శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు అంటుండటంతో నంద్యాల విజయ డెయిరీకి సంబంధించిన మూడు డైరెక్టర్ల ఎన్నికల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్లో జరిగింది.
శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై ఊరేగనున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవుల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆల్ఫా కాలేజ్ సమీపంలో భారీ ఎత్తున గోవులను తరలిస్తున్న వాహనాలను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు..
శ్రీశైలంలో ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకల పేరుతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.