Home » Nampalli
నాంపల్లి ప్రాంతంలో ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులను తమ ఎగ్జిబిషన్ పర్యటనను శనివారం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
సత్యం కంప్యూటర్ స్కామ్లో జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
తెలుగు ఇండస్ట్రీకి పైరసీ ద్వారా నష్టం తీసుకువస్తున్నాడని బోడపాటి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.