Home » Mudragada Padmanabham
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాపు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ప్రస్తుతం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరే ఎక్కడ చూసినా వినిపిస్తోంది.
కాపులకు ఏకైక నాయకుడిగా ఉండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తాపత్రయ పడుతున్నారని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogaiah) విమర్శించారు.
ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా హీటెక్కాయి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు, కౌంటర్లతో మార్మోగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) , జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) పేర్లే వినిపిస్తున్నాయి..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు బహిరంగ లేఖ రాశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో లేఖ రాశారు. అభిమానులతో బండబూతులతో మెసేజ్లు పెట్టిస్తున్నారని.. అలా చేయడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారేమోనని విమర్శించారు. ఆ మెసేజ్లకు భయపడి తాను లొంగిపోవడం ఈ జన్మకు జరగదన్నారు. పవన్ సినిమాలో హీరో తప్ప.. రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించాలన్నారు. తనను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు జనసేన నేతలు ఝలక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ముద్రగడకు వెయ్యి రూపాయిల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఇందు కోసం యువకులు వందల్లో పోస్ట్ ఆఫీస్ల వద్ద క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే.
మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంపై (Mudragada Padmanabham) పాలకొల్లు కాపు నేతలు (Kapu leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అమ్ముడుపోయిన ముద్రగడ.. కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నిందిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై జనసేన సైనికుల సోషల్ మీడియా యుద్ధం మొదలు పెట్టారు. ముద్రగడను ఉద్దేశిస్తూ ఓ పేద కాపు యువకుడి ఆవేదన అంటూ సోషల్ మీడియాలో లేఖను వైరల్ చేస్తున్నారు.