Home » MS Raju
పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.
భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు.
‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్ తన సైకో బ్యాచ్తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
శవాల పునాదులపైనే జగన్ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.
MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు