Home » MLC Elections
ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. సరదాగా, ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.
తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలను ఎందుకు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్సీలు ఏమి చేస్తారు. శాసనమండలి సభ్యుల బాధ్యత ఏమిటి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఏమవుతుందనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా కొందరు అభ్యర్థులు బుధవారం రాత్రి ఓటర్లకు గప్చు్పగా డబ్బు పంపీణీ చేశారు. నల్లగొండలో ఓ అభ్యర్థి తరఫున అనుయాయులు ఒక్కో ఓటరు ఇంటికి వెళ్లి రూ.2 వేలు అందజేయగా, మరో ఇద్దరు అభ్యర్థులు రూ.1,000 నుంచి రూ.1,200, రూ.2500 ఇచ్చారని సమాచారం.
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ గురువారం జరగనుంది.
ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.
తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల...
అమరావతి: ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపుతున్నారు. ఆయా కేంద్రాలవద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.