Home » Minister Nara Lokesh
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేష్ కొనియాడారు.
కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగు దేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు. అలాగే విశాఖ సీఐఐ సదస్సుపై కూడా మంత్రులతో జరిగిన సమావేశంలో లోకేష్ చర్చించారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ లోకానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యా విప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ బాషాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.