Home » Medigadda Barrage
Telangana: కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు - రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు (శుక్రవారం) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
BRS Calls Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు.
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ తప్ప మరే సబ్జెక్ట్ దొరకడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లకపోవడాన్ని ఆ పార్టీ నేత రవీంద్ర నాయక్ ( Ravindra Naik) తప్పు పట్టారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress, BRS) మధ్య ప్రాజెక్ట్స్ ఫైట్ (Project Fight) రోజురోజుకీ హీటెక్కుతోంది. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ (Chalo Medigadda) అంటూ కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ (Chalo Nalgonda) అంటూ బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..
Telangana: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది.
రేపు(మంగళవారం) మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావలని ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Kumar Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు.