Home » Markapuram
వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు.
నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
మార్కాపురం బస్సు ప్రమాదంలో డ్రైవర్, ఓవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26న జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.
ఇవాళ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు విడుదలయ్యాయి.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. బస్సు ప్రమాద ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.