Home » Maoist Encounter
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్సగఢ్లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.
అబూజ్మఢ్లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్జోన్గా మార్చుకుంటున్నారా?
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.
పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు.
పువర్తి.. ఛత్తీ్స్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని కీలకమైన మావోయిస్టు ప్రభావిత గ్రా మం. అంతేకాదు హార్డ్ కోర్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామం కూడా ఇదే!
కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్మఢ్లో ఇంద్రావతి దళం నక్సల్స్ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీ్సగఢ్లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీ్సస్టేషన్ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్ క్యాంప్పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.