Home » Mancherial
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్కు తరలివచ్చారు.
అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్ అన్నారు. శ్రీరాంపూర్లోని అరుణక్కనగర్ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్రావు, గడ్డం వివేకానంద్, గడ్డం వినోద్లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది.
సీపీఐ వందేళ్ళ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజలు, కార్మికులు, రైతుల సమ స్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.
నస్పూర్లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు.