• Home » Mancherial district

Mancherial district

శాలివాహన భూములను అమ్మవద్దు

శాలివాహన భూములను అమ్మవద్దు

పాత మంచిర్యాలలో శాలివాహన పవర్‌ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్‌ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.

దేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద

దేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.

ఎస్టీపీపీకి సేఫ్టీ అవార్డు

ఎస్టీపీపీకి సేఫ్టీ అవార్డు

సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్‌-పవర్‌ థర్మల్‌ సెక్టర్‌ విభాగంలో 1వ గ్రీన్‌ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్‌ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు.

ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌లకు మోక్షమెప్పుడో...!

ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌లకు మోక్షమెప్పుడో...!

మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్‌ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ప్రాణహిత, కుప్తి, మందాకిని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పేర్కొ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముం దు సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు.

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సాపూర్‌ (బెజ్జాల) గ్రామంలో తాండూర్‌ సర్కిల్‌ పోలీసులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాజారమేష్‌ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.

ఆగని ఇసుక అక్రమ రవాణా...

ఆగని ఇసుక అక్రమ రవాణా...

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి