• Home » Maldives

Maldives

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.

Union Budget  : మాల్దీవులకు ‘సాయం’లో కోత

Union Budget : మాల్దీవులకు ‘సాయం’లో కోత

కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌

మాల్దీవులు వద్దు..  లక్షద్వీప్‌ ఉందిగా..

మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్‌ ఉందిగా..

ఇజ్రాయెల్‌ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్‌లోని లక్షద్వీ్‌పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌లో ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కోబీ షోషాని స్వాగతించారు.

India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?

India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?

మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి.. ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం, టూరిజం వివాదం, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Maldives request India: భారత్ పెద్దమనసు.. మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతికి ఓకే

Maldives request India: భారత్ పెద్దమనసు.. మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతికి ఓకే

మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

India Maldives Row: ముయిజ్జు.. మొండితనం మానేసి, సంబంధాల్ని సరిదిద్దుకోండి

India Maldives Row: ముయిజ్జు.. మొండితనం మానేసి, సంబంధాల్ని సరిదిద్దుకోండి

మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముయిజ్జు భారత వ్యతిరేకత వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అదే డిమాండ్ చేశారు.

India Maldives Row: భారతీయులారా.. మమ్మల్ని క్షమించండి

India Maldives Row: భారతీయులారా.. మమ్మల్ని క్షమించండి

భారత్, మాల్దీవుల (India Maldives Row) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) భారతీయులకు క్షమాపణలు చెప్పారు. భారత్ పట్ల తమ మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు.

Maldives: ఇదిరా భారత్ దెబ్బ.. మాల్దీవులకు భారీగా తగ్గిన ఇండియన్ టూరిస్టులు..

Maldives: ఇదిరా భారత్ దెబ్బ.. మాల్దీవులకు భారీగా తగ్గిన ఇండియన్ టూరిస్టులు..

భారత్‌తో దౌత్యపర వివాదం మాల్దీవుల(Maldives) సర్కార్‌కు తీరని నష్టం మిగులుస్తోంది. ఆ దేశానికి పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో భారతీయుల వాటే అధికం. ఈ వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33 శాతానికి తగ్గిందని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదించింది. దీంతో ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Mohamed Muizzu: మరోసారి నోరుపారేసుకున్న ముయిజ్జు.. చివరికి సివిల్ దుస్తుల్లో కూడా..

Mohamed Muizzu: మరోసారి నోరుపారేసుకున్న ముయిజ్జు.. చివరికి సివిల్ దుస్తుల్లో కూడా..

మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి భారతదేశంపై (India) నోరుపారేసుకున్నారు. మే 10వ తేదీ తర్వాత భారత సైన్యం (Indian Troops) మాల్దీవుల్లో ఉండరని, చివరికి సివిల్ దుస్తుల్లో కూడా తమ భూభాగంపై కనిపించరని అన్నారు. మాల్దీవులు, చైనా (Maldives-China) మధ్య సైనిక సహకారంపై (Free Military Aid) కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి