Home » Mahesh Kumar Goud
జనహిత పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24న పునః ప్రారంభం కానుంది.
ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్గా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాల, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని మహేష్ గౌడ్ విమర్శించారు.
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పగలంతా ముస్లింలను తిడతారని, సాయంత్రమైతే వాళ్ల జపం చేస్తారని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కుల సర్వేను చూసి ప్రధాని మోదీ ముఖం చాటేశారని, అమిత్ షా ఇంట్లో దాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్రలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధికారులను కాదని, అన్నీ తానై అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహే్షకుమార్గౌడ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు.