Home » Lucknow Super Gaints
ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో గెలుపు అంచనాలను ఇక్కడ చుద్దాం.
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్గా అవతరించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగో మ్యాచ్(4th Match) మొదలు కానుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రాజస్థాన్ జైపూర్(jaipur)లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు.
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్కతా నైట్ రైడర్స్లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో కేకేఆర్కు గంభీర్ మెంటార్గా వ్యవహరించనున్నాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఈ ఏడాది డిసెంబర్లో మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. దీంతో జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకుని వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ఆటగాళ్లను తప్పించనుంది. దీపక్ హుడా, అమిత్ మిశ్రా, కరుణ్ నాయర్ స్థానాలలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకుని వచ్చే ఏడాది ఛాంపియన్గా నిలవాలని లక్నో సూపర్ జెయింట్స్ తహతహలాడుతోంది.