Home » Lok Sabha Election 2024
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.
తాజాగా నరేంద్ర మోదీ కేబినెట్ కొలువు తీరింది. ఈ కేబినెట్లో సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని తన మంత్రి పదవికి ఆయన మంగళవారం రాజీనామా చేశారు.
ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి కనిపించింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన వెనక.. మెట్లపైన ఓ జంతువు వెళ్తూ కనిపించింది.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్నాథ్సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై పంజాబ్ ఎయిర్పోర్ట్లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు.
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.
‘మోదీ 3.0’ సర్కారు ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ, 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్సభ స్పీకర్ ఎవరు?.
ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే అలహాబాద్ లోక్సభ స్థానాన్ని సైతం ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.