Home » Lalu prasad yadav
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాట్నాలో గల రాజేంద్ర నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తేజ్ ప్రతాప్ యాదవ్కు చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువు కాదని, తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదని అన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోదీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బీహార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.
బిహార్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది.